Breaking News

మావోల్లో మిగిలింది 17 మందే: డీజీపీ


Published on: 03 Jan 2026 17:42  IST

మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. శనివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన డీజీపీ.. గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బడ్సే సూక్కా అలియాస్ దేవాతో పాటు 17 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. వీరితో పాటు.. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్య.. ఇద్దరూ లొంగిపోయారని తెలిపారు. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వ్యక్తి దేవా అని.. ఎన్ఐఏ నుంచి దేవా పైన రూ. 75 లక్షల రివార్డ్ ఉందని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి