Breaking News

విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గిస్తాం


Published on: 05 Jan 2026 14:31  IST

రానున్న రోజుల్లో విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సోలార్‌, విండ్‌, బయో విద్యుత్‌ రంగాల్లో 80 గిగావాట్ల విద్యుత్‌ను తక్కువ ధరకు తీసుకునే విధంగా అగ్రిమెంట్‌ చేసుకుంటున్నామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి