Breaking News

హరీశ్‌ విచారణకు అనుమతివ్వండి


Published on: 05 Jan 2026 12:46  IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ నాగరత్న నేతృత్వంలోని జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన దిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. హరీశ్‌రావు ఆదేశాల మేరకు పోలీస్‌ అధికారి రాధాకిషన్‌రావు తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని ఆరోపిస్తూ 2024లో సిద్దిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌ గౌడ్‌ పంజాగుట్ట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి