Breaking News

జూబ్లీహిల్స్ వెనుకబాటుకు బాధ్యత వహించాలి


Published on: 06 Nov 2025 14:06  IST

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్‌లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి ఓటు వేయాలనే దానిపై ఓటర్లు ఇంకా నిర్ణయానికి రాలేదని.. అందుకే సర్వేల్లో కూడా స్పష్టత లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కిషన్ రెడ్డి కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి