Breaking News

డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..


Published on: 05 Nov 2025 12:55  IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే తెలంగాణలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ముందు ఉన్న కారును తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ అవడంతో బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి