Breaking News

రూ. 80 వేల డబ్బుకు వడ్డీతో కలిపి రూ. 1.9 లక్షలు..


Published on: 04 Nov 2025 15:21  IST

మెదక్ జిల్లా రామాయంపేటలో నివాసముండే సామల శ్రీశైలం(35) అనే యువకుడు కుటుంబ అవసరాల నిమిత్తం లోన్ యాప్‌లో 80 వేల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. అవి కాస్తా వడ్డీతో కలిపి ఒక్క లక్షా 90 వేల రూపాయలు అయ్యాయి. వాటిని వెంటనే కట్టాలని లోన్ యాప్ సిబ్బంది శ్రీశైలంను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టారు. ఆందోళనకు గురైన శ్రీశైలం పురుగుల మందు సేవించి మృతి చెందాడు.బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి