Breaking News

ప్రముఖులను విచారించండి.. A2 సునీల్ యాదవ్‌


Published on: 04 Nov 2025 14:32  IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న సునీత పిటిషన్‌పై CBI ప్రత్యేక కోర్టులో విచారణ జరగగా, ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ తన కౌంటర్‌ను దాఖలు చేశాడు. కౌంటర్‌లో సునీల్ యాదవ్ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. CBI దర్యాప్తు కొనసాగించాలన్న సునీత పిటిషన్‌కు మద్దతు తెలిపారు. వివేకా కేసులో అనేకమంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందని సునీల్‌ పేర్కొన్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి