Breaking News

ఆ వాహనాల డ్రైవర్ల వేతనాలు చెల్లించాలి


Published on: 04 Nov 2025 12:49  IST

రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య శాఖలో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలను చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. వాణిజ్య పన్నులశాఖ అద్దె వాహనాల డ్రైవర్ల సంఘం నాయకులు రాజు, రాంబాబుల ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్‌ నుంచి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వరకు డ్రైవర్ల గర్జన నిరసన ర్యాలీ జరిగింది. వాణిజ్య పన్నుల శాఖల్లో గత 9 నెలలుగా అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి