Breaking News

నాలుగో రోజూ ఆరని మంటలు..!


Published on: 09 Jan 2026 12:41  IST

కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఔట్‌ మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది నాలుగు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్లో ఔట్‌ సైట్‌ వద్ద కుప్ప కూలిపోయిన డీప్‌ ఇండస్ర్టీస్‌ రిగ్గు శకలాలను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. ఎగిసిపడుతున్న గ్యాస్‌ మంటలను అదుపు చేసేందుకు నిరంతరం వాటర్‌ అంబ్రెల్లాలతో నీటిని వెదజల్లుతున్నారు.దీంతో మంటల ఎత్తు క్రమంగా తగ్గుతోంది.ఓఎన్జీసీకి చెందిన శ్రీహరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సక్సేనా ఆధ్వర్యంలో నిపుణులు వెల్‌ మౌత్‌ వద్ద పరిస్థితిని సమీక్షించారు.

Follow us on , &

ఇవీ చదవండి