Breaking News

బస్సును ఢీకొట్టిన లారీ..9 మందికి గాయాలు..


Published on: 08 Jan 2026 12:29  IST

బుధవారం రాత్రి గంగవరం మండలం పొన్న మాకులపల్లి వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల బస్సును ఓలారీ వెనుక నుంచి ఢీ కొట్టింది.విద్యార్థులు బెంగుళూరులో వైద్య పరీక్షలు ముగించుకుని స్కూలు బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి