Breaking News

శ్రేయ గ్రూప్ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ..


Published on: 03 Jan 2026 16:31  IST

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన శ్రేయా గ్రూప్ ఆర్థిక కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ (AP CID) దర్యాప్తు వేగవంతం చేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి 8,128 మందికి పైగా ప్రజలను మోసం చేసి సుమారు రూ.206 కోట్లు దండుకున్న శ్రేయా గ్రూప్స్ సంస్థపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శ్రేయా గ్రూప్ సంస్థతో పాటు ఆ సంస్థ యజమానుల వ్యక్తిగత ఆస్తులను జప్తు (Attachment) చేసేందుకు ఏపీ ప్రభుత్వం సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి