Breaking News

కేసీఆర్‌..సభకు రావాలి


Published on: 03 Jan 2026 13:07  IST

కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా, సభలో మాట్లాడకుండా ఉంటే ఇక బీఆర్‌ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఇన్‌టేక్‌ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో ఆయనే స్వయంగా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కోరారు. శుక్రవారం శాసనమండలి ఆవరణలో ఆమె మీడియాతో చిట్‌ చాట్‌గా మాట్లాడారు. బబుల్‌ షూటర్ల(బుడగలు పేల్చేవారి) వల్లే పార్టీకి ట్రబుల్స్‌ వచ్చాయని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి