Breaking News

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ


Published on: 29 Oct 2025 17:11  IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'ఓట్ల కోసం ఆయన ఏదైనా చేస్తారు' అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. స్థానిక గుండాలా రాహుల్ మాట్లాడుతున్నారంటూ మండిపడింది.'మహాగట్‌బంధన్' తరఫున ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి