Breaking News

నగరంలో జింక మాంసం కలకలం..


Published on: 30 Dec 2025 16:17  IST

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్  పరిధిలో జింక మాంసం విక్రయాలు కలకలం రేపాయి. అత్తాపూర్‌లోని సులేమాన్ నగర్ ప్రాంతంలో జింక మాంసాన్ని అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్‌ను ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పక్కాగా సమాచారం రావడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నిందితుడి దగ్గరి నుంచి భారీగా జింక మాంసం, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి