Breaking News

అప్సా ఎన్నికల పోలింగ్..సచివాలయంలో సందడి


Published on: 29 Dec 2025 16:28  IST

సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమైంది. ప్రత్యేక ఎన్నికల అధికారి జంపని శివయ్య పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. అప్సా అధ్యక్ష పదవితో పాటు మరో ఎనిమిది కార్యవర్గ సభ్యుల పదవులకు, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌కు నేడు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి