Breaking News

ఇద్దరు బీసీ మంత్రుల ఔట్‌!


Published on: 05 Nov 2025 16:40  IST

తెలంగాణ మంత్రివర్గంపై సౌత్‌ఫస్ట్‌ ఎడిటర్‌ జీఎస్‌ వాసు ప్రత్యేక కథనం రాశారు. ఇందులో రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులుంటాయని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా సౌత్‌ఫస్ట్‌ కథనం ఉన్నది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు షాక్‌ ఇవ్వనున్నదని కథనంలో పేర్కొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతారని కథనంలో రాశారు. పదవులు కోల్పోయే వారి స్థానంలో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పిస్తారని,కథనంలో ప్రస్తావించారు.

Follow us on , &

ఇవీ చదవండి