Breaking News

రుణం తక్కువ.. వసూళ్లు ఎక్కువ..


Published on: 05 Nov 2025 14:51  IST

తనకు బ్యాంకులు ఇచ్చిన రుణం కన్నా.. ఎక్కువ మొత్తంలో వసూలు చేశాయని విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్య అభ్యంతరం తెలిపారు. తన నుంచి వసూలు చేసిన అసలు, వడ్డీలకు మరోసారి కొత్తగా వడ్డీ విధిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలుచేశారు. యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ ఆధీనంలో ఉన్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో తాను, తన కంపెనీ తీసుకున్న రుణాల్లో బకాయిల వివరాలను బ్యాంకులు విడుదల చేయాలని కోరుతూ ఈ వ్యాజ్యం వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి