Breaking News

మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు


Published on: 04 Nov 2025 17:25  IST

గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలు రక్తహీనతకి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపామని పేర్కొన్నారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారి కోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలింతలు, గర్భవతులకు సకాలంలో పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి