Breaking News

ప్రభుత్వంపై సైబర్‌ నేరగాళ్ల పంజా..


Published on: 01 Nov 2025 15:17  IST

రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్‌ నేరగాళ్లు పంజా విసిరారు. భూ భారతి, ఆరోగ్యశ్రీ, మీ-సేవ, జీహెచ్‌ఎంసీ లాంటి ప్రధానమైన వెబ్‌సైట్లను హ్యాక్‌చేసి ఎంతో విలువైన ప్రభుత్వ డాటాతోపాటు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించినట్టు ‘సైబర్‌ హెల్ప్‌’ అనే ఎన్జీవో వెల్లడించింది. ప్రభుత్వంలోని 22 ప్రధాన విభాగాల డాటాను డార్‌ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు తెలిపింది. దీనితోపాటు తెలంగాణ పౌరుల ఆధార్‌, ఆరోగ్య వివరాలు, భూములకు సంబంధించిన డాటా సైతం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో ఉన్నదని పేర్కొన్నది.

Follow us on , &

ఇవీ చదవండి