Breaking News

రెండు రోజుల్లో భారత్‌కు ఆసియా కప్‌


Published on: 01 Nov 2025 11:08  IST

ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి రోజూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. తాజాగా ఈ ట్రోఫీపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చీఫ్‌ నఖ్వీ రెండు రోజుల్లో ట్రోఫీని భారత్‌కు అప్పగించే అవకాశముందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. టీమిండియా ఆసియా కప్ గెల్చి.. నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రోఫీ, మెడల్స్‌ను అందించకపోవడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి