Breaking News

తల్లులకు బంగారం.. వ్యాపారులకు వరం


Published on: 20 Jan 2026 18:31  IST

భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోలాహలం మొదలైంది. కోరిన కోరికలు తీర్చే తల్లులకు భక్తులు నిలువెత్తు బంగారం(బెల్లం) తులా భారం సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. జాతర సమీపిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో బెల్లం అమ్మకాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గతంతో పోల్చితే ఈసారి భారీగా అమ్మకాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు. దీంతో ముందస్తుగా భారీగా ప్రస్తుతం నిల్వ చేసుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి