Breaking News

భార్యను పచ్చడి బండతో కొట్టి చంపిన భర్త


Published on: 31 Dec 2025 15:24  IST

చిలకలూరిపేట మండలం వేలూరులో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. వేలూరులో సాల్మన్ రాజు, పుష్ప దంపతులు నివాసముంటున్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి భర్తకు భార్యపై అనుమానం ఉండేది. దీని కారణంగా ప్రతీరోజు ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. అలాగే గత రాత్రి కూడా ఇదే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన భర్త సాల్మన్ రాజు భార్యపై అనుమానంతో పచ్చడి బండతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది.

Follow us on , &

ఇవీ చదవండి