Breaking News

హైకోర్టును ఆశ్రయించిన సువర్ణరాజు


Published on: 31 Dec 2025 14:31  IST

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసుల రికార్డులకు సంబంధించి తీర్పు ప్రతులను ఇవ్వాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణ రాజు ఇటీవల ఆశ్రయించారు. వీటిని ఇచ్చేందుకు సదరు కోర్టు నిరాకరించింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో సువర్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ ఏపీ సీఐడీని కోర్టు ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి