Breaking News

వైసీపీ నాయకుడి కంకర మిషన్‌ మూసివేత


Published on: 09 Jan 2026 16:58  IST

మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల సమీపంలో ఉన్న వైసీపీ నాయకుడు ప్రణీత్‌రెడ్డికి చెందిన శివసాయి కంకర మిషన్‌ (స్టోన్‌ క్రషర్‌ ఫ్యాక్టరీ)ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరాను కూడా నిలిపివేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించింది. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టలేదని 2024 జనవరి 26న ఈ ఫ్యాక్టరీని కాలుష్యనియంత్రణ మండలి మూసి వేసింది. దీనిపై యజమాన్యం హైకోర్టుకు వెళ్లి మూసివేతను ఆపింది.

Follow us on , &

ఇవీ చదవండి