Breaking News

ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాపై అధికారుల కొరడా..


Published on: 09 Jan 2026 11:17  IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝులిపించారు. ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పాయింట్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపివేసి విస్తృత తనిఖీలు చేపట్టారు.నిబంధనలకు పాతర వేసిన ఐదు బస్సులపై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి