Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..


Published on: 03 Jan 2026 19:00  IST

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు .కిష్టారం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో కుంట ఏరియా కార్యదర్శి మంగడు మృతిచెందినట్లు తెలిసింది.ఘటనాస్థలిలో ఏకే 47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి