Breaking News

బళ్లారిలో టెన్షన్‌.. టెన్షన్‌..


Published on: 02 Jan 2026 15:50  IST

రేపు బళ్లారిలో కాంగ్రెస్ నేతలు వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్గీయులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటిదగ్గర ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనిని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లు రువ్వడం వివాదం రాజుకుంది. ఇరు వర్గాలకు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుతూ.. తుపాకులతో కాల్పులు జరిపారు. తుపాకి కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ (30) మృతి చెందారు. 

Follow us on , &

ఇవీ చదవండి