Breaking News

ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ..


Published on: 14 Nov 2025 17:45  IST

ఫ్లిప్‌కార్ట్‌ను నకిలీ కస్టమర్లు మోసగించారు. రూ.1.6 కోట్ల విలువైన 332 మొబైల్‌ ఫోన్లు చోరీ చేశారు. ఈ మోసాన్ని గ్రహించిన ఫ్లిప్‌కార్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 8 నుంచి అక్టోబర్‌ 10 మధ్య నకిలీ చిరునామాలు, వేర్వేరు మొబైల్‌ నంబర్ల నుంచి రూ. 1.61 కోట్ల విలువైన 332 మొబైల్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో నిందితులు ఆర్డర్‌ చేశారు. ఖరీదైన ఆపిల్ ఐఫోన్, శామ్‌సంగ్ గెలాక్సీ, వివో, ఐక్యూవోవో మోడల్స్‌ ఇందులో ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి