Breaking News

తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..


Published on: 13 Nov 2025 16:01  IST

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో విజయనగర జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పేలుడు జరిగిన రాత్రి నుంచే పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హొసపేట పట్టణంలో లాడ్జిలు, హోంస్టేలో నివాసం ఉంటున్న వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. రైల్వే పోలీసు స్టేషన్‌, బస్టాండు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి