Breaking News

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై బస్సు కండక్టర్‌


Published on: 03 Nov 2025 14:32  IST

ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో తమకు తెలియలేదని బస్సు కండక్టర్‌ తెలిపారు. ప్రమాదాన్ని గ్రహించేలోపే కంకర లారీ బస్సును ఢీకొట్టిందని చెప్పారు. బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి