Breaking News

మావోయిస్టుల కంచుకోటపై బలగాల పాగా


Published on: 20 Jan 2026 18:42  IST

మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్రం మరో అడుగు ముందుకేసింది. మావోలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో విస్తరించిన కీకారణ్యంపై భద్రతా యంత్రాంగం పాగా వేసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పామునూరు గుట్టపై ఎఫ్‌వోబీ (ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌)ని ఏర్పాటు చేసింది. కేంద్ర సాయుధ బలగాలతో కూడిన యూనిట్‌ను మంగళవారం అధికారికంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది.

Follow us on , &

ఇవీ చదవండి