Breaking News

సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయాలి


Published on: 20 Jan 2026 16:32  IST

నేలకొండపల్లిలో సిద్దార్థ యోగ విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె.నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడటం వల్ల నేల విషతుల్యమవుతోందన్నారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. ప్రతి రైతూ గతంలో మాదిరిగా సేంద్రియ సాగు వైపు దృష్టి సారించాలని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి