Breaking News

టీడీపీ నేతల ఫైర్‌..దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు


Published on: 20 Jan 2026 14:59  IST

హిందూపురం నియోజకవర్గంలో దందాలు, దౌర్జన్యాలు చేయడం వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుతుందని గతంలో నియోజకవర్గ పరిధిలో చూశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ పురం ఇన్‌చార్జి దీపిక భర్త వేణురెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఎమ్మెల్యే, వ్యక్తిగత కార్యదర్శులు టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. సూగూరు చెరువుకు గండి కొట్టారన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వేణురెడ్డి మాటలను ఖండించారు.

Follow us on , &

ఇవీ చదవండి