Breaking News

ఈసారి కూడా మల్లికా సాగరే..


Published on: 16 Dec 2025 16:59  IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం మినీ ఆక్షన్ వేలంపాటలో మొత్తం 369 మంది ఆటగాళ్లను వేలం వేసే బాధ్యత మల్లికా సాగర్ దే. గతంలో ఐపీఎల్ ఆక్షన్‌లను రిచర్డ్ మ్యాడ్లీ, హ్యూ ఎడ్మీడ్స్, చారు శర్మ వంటి వారు నిర్వహించారు. కానీ 2024 నుంచి మల్లికా సాగర్ ఈ కీలక బాధ్యతను స్వీకరించారు. ఆమె ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్‌ను, సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మల్లికా సాగర్ ఇప్పుడు ఐపీఎల్ వేలం పాటలో ఒక చరిత్ర సృష్టించే వ్యక్తిగా స్థిరపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి