Breaking News

భయపెడుతున్న బెండ.. ఘాటెక్కిస్తున్న మిర్చి


Published on: 14 Nov 2025 12:16  IST

రైతుబజార్‌, కూరగాయల మార్కెట్‌లో పచ్చిమిర్చి, బెండకాయ రేటు ఎక్కువగా పెరిగింది. గత అక్టోబరు చివరి వారంలో రైతుబజార్‌లో కిలో రూ.40 ఉన్న మిర్చి ధర.. వారం రోజులుగా రూ.45 పలుకుతోంది. మాల్స్‌, రిటైల్‌ దుకాణాలు, ఆన్‌లైన్‌ డెలివరీల్లో దీనిని రూ. 60 వరకు అమ్ముతున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. క్యాప్సికమ్‌, దొండకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, క్యారట్‌ రేట్లు కూడా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. టమాట, ఉల్లిపాయ ధరలు కొద్దిగా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు

Follow us on , &

ఇవీ చదవండి