Breaking News

వరంగల్లో చెట్టును ఢీకొన్న కారు

వరంగల్-హన్మకొండలోని కొత్తగట్టు శివారులో కారు చెట్టును ఢీకొన్న ప్రమాదం నవంబర్ 12, 2025 బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణం, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.


Published on: 13 Nov 2025 11:39  IST

వరంగల్-హన్మకొండలోని కొత్తగట్టు శివారులో కారు చెట్టును ఢీకొన్న ప్రమాదం నవంబర్ 12, 2025 బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణం, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లికి చెందిన పార్శ సంపత్, హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన బొంపల్లి కిషన్, వెంకటేశ్, ఆత్మకూరుకు చెందిన చింతపట్ల మురళీకృష్ణ... వీరంతా కారులో పరకాల నుంచి హనుమకొండ వైపు వెళ్తున్నారు. కారు అతివేగంగా వెళ్తూ రహదారి పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో పార్శ సంపత్, బొంపల్లి కిషన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మురళీకృష్ణ, వెంకటేశ్‌లను వరంగల్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి