Breaking News

హైదరాబాద్‌‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు


Published on: 06 Nov 2025 10:47  IST

తెలంగాణను డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. తాజాగా మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు.రాజేంద్రనగర్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి