Breaking News

ఏపీ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు


Published on: 05 Nov 2025 18:12  IST

ఏపీ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మొత్తం 120 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ మేరకు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు.. అనుమానాస్పదంగా ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి