Breaking News

కోనసీమ ఘోరరోడ్డు ప్రమాదం తల్లీకొడుకు మృతి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గండేపల్లి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి మెరుగైన వైద్యం అందించడం కోసం విశాఖపట్నం ఆస్పత్రికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 


Published on: 16 Dec 2025 11:59  IST

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గండేపల్లి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి మెరుగైన వైద్యం అందించడం కోసం విశాఖపట్నం ఆస్పత్రికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

ఆత్రేయపురం మండలం వెలుచూరు గ్రామానికి చెందిన తోర్లపాటి తులసి (40), ఆమె కుమారుడు శశికుమార్ (24).మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు, ముందు వెళ్తున్న ట్రాలీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తులసి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన శశికుమార్‌ను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారికి రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగబాబు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి