Breaking News

ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి..


Published on: 12 Jan 2026 19:19  IST

తిరుపతిలో(Tirupati) ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని బలిజపల్లిలో మహిళ మృతిచెందింది. మృతురాలిని మల్లేశ్వరి(52)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. నాలుగు రోజుల క్రితమే మల్లేశ్వరి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి