Breaking News

ఖమ్మం జిల్లాలో కారును ఢీకొన్న లారీ..


Published on: 29 Dec 2025 18:54  IST

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందు కున్న వెంటనే తల్లాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి