Breaking News

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..


Published on: 06 Nov 2025 17:50  IST

ద్రోణి ప్రభావంతో రేపు (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి