Breaking News

రైతుల సమస్యలు అవినాశ్‌రెడ్డికి కనిపించలేదా..


Published on: 04 Nov 2025 17:20  IST

కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరు మీద వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలు ఆపాలని హితవు పలికారు. కడప జిల్లాలో ఏమి జరుగుతోందో చూడని అవినాశ్‌కి.. ఇప్పుడు రైతులపై అంత ఆకస్మికంగా ప్రేమ ఎందుకు..? వచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉల్లి రైతులు నష్టపోకూడదని సీఎం చంద్రబాబు ఆలోచించి హెక్టార్‌కి రూ.50,000 చొప్పున అందజేయాలని నిర్ణయించారని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి