Breaking News

సీఎం రేవంత్‌తో జర్మనీ బృందం భేటీ..


Published on: 04 Nov 2025 16:53  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను నేడు నగరంలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. అనంతరం జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి