Breaking News

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన..


Published on: 04 Nov 2025 14:02  IST

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైకాపా నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైకాపా నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు.నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అనిల్‌కుమార్‌కు చెప్పగా.. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.

Follow us on , &

ఇవీ చదవండి