Breaking News

నన్ను చంపేందుకు కుట్రలు చేస్తున్నారు..


Published on: 03 Nov 2025 18:36  IST

పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీసుపై ఆదివారం నాడు కాంగ్రెస్‌ నాయకులు దాడి చేసి, ఫర్నీచర్‌ను తగులబెట్టిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మణుగూరులో కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసును కబ్జా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుగా మార్చారని చేస్తున్న ఆరోపణలను రేగా కాంతారావు ఖండించారు.

Follow us on , &

ఇవీ చదవండి