Breaking News

నిండుకుండలా పాలేరు జలాశయం


Published on: 31 Oct 2025 15:51  IST

పాలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది, గురువారం సాయంత్రానికి అధికారుల అంచనా ప్రకారం సుమారు 45వేల క్యూసెక్కులనీరు పరీవాహకప్రాంతాలనుంచి పాలేరు జలాశయానికి వస్తోంది. ముఖ్యంగా వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తుతోంది. దీంతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయం ఫాలింగ్‌ గేట్ల ద్వారా బయటకు వదులుతున్నారు.దీంతో పాలేరు ఏటి వారగా ఉన్న, పరిసర ప్రాంతాల్లోని వరిపొలాలన్నీ నీటమునిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి