Breaking News

భారతి సిమెంట్‌ మేనేజర్‌పై కేసు నమోదు..


Published on: 31 Oct 2025 10:40  IST

భారతి సిమెంట్‌ మేనేజర్‌ భార్గవ్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ హయాంలో భూముల విషయంలో భార్గవ్‌రెడ్డి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడపకు చెందిన మహబూబ్‌ఖాన్‌ దగ్గర రూ.60 లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని మొహం చాటేసినట్లు తెలుస్తోంది. దీంతో మహబూబ్‌ఖాన్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో భార్గవ్‌రెడ్డిపై సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి