Breaking News

నిండు కుండ‌లా మూసీ న‌ది..


Published on: 29 Oct 2025 16:08  IST

న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని మూసీ న‌ది నిండు కుండ‌లా మారింది. ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో పాటు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ నుంచి మూసీకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుకుంటుంది. ఈ నేప‌థ్యంలో మూసీ ప్రాజెక్టు ఏడు గేట్ల‌ను 4 అడుగుల మేర ఎత్తి దిగువ‌కు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు యొక్క 3, 4, 5, 6, 8, 10, 12 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తిన‌ట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి