Breaking News

బాధితులకు సహాయం చేయండి..


Published on: 29 Oct 2025 15:55  IST

మొంథా తుపానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మొంథా తుపాను తీవ్రత, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. మొంథా తుపాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు.

Follow us on , &

ఇవీ చదవండి